కువైత్‌లోని భారత ఎంబసీ రెండు రోజులు మూత.. యథావిధిగా ఆ సర్వీసులు

ABN , First Publish Date - 2022-04-13T18:24:30+05:30 IST

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం గురు, ఆదివారం రెండు రోజులు మూతపడనుంది.

కువైత్‌లోని భారత ఎంబసీ రెండు రోజులు మూత.. యథావిధిగా ఆ సర్వీసులు

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం గురు, ఆదివారం రెండు రోజులు మూతపడనుంది. అయితే, ఎమర్జెన్సీ కాన్సులర్ సర్వీసులు మాత్రం యధావిధిగా ఉంటాయని ఎంబసీ వెల్లడించింది. ఈ నెల 14న(గురువారం) అంబేద్కర్ జయంతి సందర్భంగా రాయబార కార్యాలయానికి సెలవు కాగా, ఆదివారం నాడు(17న) ఈస్టర్ సండే కారణంగా ఎంబసీ మూసి ఉంచనున్నట్లు సమాచారం. కనుక ఈ రెండు రోజులు ఎంబసీలో ప్రవాసులకు ఎవైనా పనులు ఉంటే పోస్ట్‌పోన్ చేసుకుని ఆ తర్వాతి రోజుల్లో చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.   

Updated Date - 2022-04-13T18:24:30+05:30 IST