ఈ నెల 23న భారత ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
ABN , First Publish Date - 2021-06-20T15:25:32+05:30 IST
కువైట్లోని భారత ఎంబసీ ఈ నెల 23న(బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్ విధానంలో భారత రాయబారి సిబీ జార్జీతో 'ఓపెన్ హౌస్' కార్యక్రమం నిర్వహించనుంది.
కువైట్ సిటీ: కువైట్లోని భారత ఎంబసీ ఈ నెల 23న(బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్ విధానంలో భారత రాయబారి సిబీ జార్జీతో 'ఓపెన్ హౌస్' కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇటీవల కువైట్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటన, కమ్యూనిటీ సంక్షేమంపై రాయబారి మాట్లాడానున్నారు. జూన్ 9-11 తేదీల మధ్య జైశంకర్ కువైట్లో పర్యటించిన సందర్భంగా భారత సమాజానికి కలిగిన ప్రయోజనాలను వివరించనున్నారు. కువైట్లోని భారత ప్రవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక ఈ కార్యక్రమం సందర్భంగా తమ సమస్యలను తెలియజేసేందుకు ప్రవాసులు తమ పాస్పోర్టులో ఉన్న విధంగా పూర్తి పేరు, పాస్పోర్ట్ నెంబర్, సివిల్ ఐడీ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, కువైట్లో నివాసం ఉంటున్న అడ్రస్ వివరాలతో రాయబార కార్యాలయం ఈ-మెయిల్ ఐడీ community.kuwait@mea.gov.inకు మెయిల్ చేయాలి. ఈ వర్చువల్ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లింక్: https://zoom.us/j/92084791973?pwd=RlBjc0tIa1I3OEg1bHRIakZrOEF2dz09
లాగిన్ వివరాలు
మీటింగ్: 920 8479 1973
పాస్కోడ్: 558706
అలాగే ఈ కార్యక్రమం ఎంబసీ అధికారిక ఫేస్బుక్ పేజీలో(https://m.facebook.com/indianembassykuwait/) ప్రత్యక్షప్రసారం కానుంది.