ఉక్రెయిన్ నుంచి పోలండ్కు తరలిపోయిన భారత రాయబార కార్యాలయం
ABN , First Publish Date - 2022-03-13T22:57:28+05:30 IST
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం..
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలండ్కు తరలించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.
ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్లోని తాజా పరిణామాలు, ఆఫ్ఘనిస్థాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’కు సంబంధించిన వివరాలను అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. ఖార్కివ్లో మృతి చెందిన కర్ణాటక వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మోదీ ఆదేశించారు.