Kuwait లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. జూన్ 15వ తేదీన Indian Embassy ఆధ్వర్యంలో..

ABN , First Publish Date - 2022-06-14T13:34:57+05:30 IST

కువైత్‌లోని భారత ఎంబసీ బుధవారం(జూన్ 15వ తారీఖు) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

Kuwait లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. జూన్ 15వ తేదీన Indian Embassy ఆధ్వర్యంలో..

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత ఎంబసీ బుధవారం(జూన్ 15వ తారీఖు) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని భారత ప్రవాసులు గమనించాలని కోరింది. భారత రాయబారి సిబి జార్జ్‌ ఈ కార్యక్రమం ద్వారా కువైత్‌లోని భారత ప్రవాసుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చిస్తారు. అరేబియన్ గల్ఫ్ స్టేషన్ పరిధిలో ఉన్న సఫత్‌లోని డిప్లామాటిక్ ఎన్‌క్లేవ్‌లో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల(కువైత్ కాలమానం ప్రకారం) వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత ఎంబసీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బుధవారం ఉదయం 10.00 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. 


కువైత్‌లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం లేదని ఎంబసీ స్పష్టం చేసింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు రిజిస్ట్రేషన్ చేసుకుని నేరుగా సఫత్‌లోని డిప్లామాటిక్ ఎన్‌క్లేవ్‌‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైత్‌లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన amboff.kuwait@mea.gov.in కు ఈ-మెయిల్ చేయాలి. 

Updated Date - 2022-06-14T13:34:57+05:30 IST