Mahzooz Draw లో భారత వ్యక్తికి జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నాడంటే..?

ABN , First Publish Date - 2022-02-12T14:12:39+05:30 IST

మహజూజ్ లక్కీ డ్రాలో భారత వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది.

Mahzooz Draw లో భారత వ్యక్తికి జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నాడంటే..?

దుబాయ్: మహజూజ్ లక్కీ డ్రాలో భారత వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. దుబాయ్‌లో నిర్వహించిన 63వ మహజూజ్ వీక్లీ డ్రాలో భారత్‌కు చెందిన షబ్బీర్(36) లక్ష దిర్హమ్స్(రూ.20.59లక్షలు) గెలుచుకున్నాడు. అతడితో పాటు పాకిస్థాన్ వాసి అరిఫా(47), ఫిలిప్పీన్స్‌కు చెందిన మెర్రిక్(59) కూడా చెరో లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు. ముగ్గురు విజేతలు కూడా తాము గెలిచిన నగదులో కొంత మొత్తం చారిటీకి వినియోగిస్తామని చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తన జీవితంలోనే ఒకేసారి ఇంత భారీ నగదు చూడడం ఇదే తొలిసారి అని తెలిపాడు.


ప్రతి వారం మహజూజ్ వీక్లీ డ్రా విజేతలకు సంబంధించిన సమాచారాన్ని రేడియో, న్యూస్ పేపర్లలో చదవడం ద్వారా తాను కూడా ఇందులో పాల్గొన్నట్లు తెలిపాడు. దుబాయ్‌లోని ఓ ఫర్నీచర్ షాపులో మేనేజర్‌గా పని చేసే అతడు.. మహజూజ్ వీక్లీ డ్రా విజేతల స్టోరీల ప్రేరణతో ఇటీవల ఇందులో పాల్గొన్నట్లు చెప్పాడు. ఇక తాను గెలిచిన ఈ భారీ మొత్తాన్ని ఏం చేయాలనే విషయం తన పేరెంట్స్‌కు వదిలేశానన్నాడు. ఈ నగదు బహుమతి ద్వారా తన జీవితం ఎంతోకొంత మార్పు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, ఇందులో కొంత భాగం మాత్రం తప్పనిసరిగా చారిటీ కార్యక్రమాలకు ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు.     


Updated Date - 2022-02-12T14:12:39+05:30 IST