Mahzooz draw: జాక్‌పాట్ కొట్టిన ఇండియన్ టెకీ.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ. 21కోట్లు!

ABN , First Publish Date - 2022-07-07T16:59:52+05:30 IST

మహజూజ్ రాఫెల్‌ (Mahzooz draw)లో భారతీయ ఐటీ ఇంజనీర్ జాక్‌పాట్ కొట్టాడు.

Mahzooz draw: జాక్‌పాట్ కొట్టిన ఇండియన్ టెకీ.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ. 21కోట్లు!

దుబాయ్: మహజూజ్ రాఫెల్‌ (Mahzooz draw)లో భారతీయ ఐటీ ఇంజనీర్ జాక్‌పాట్ కొట్టాడు. దుబాయ్‌లో తాజాగా నిర్వహించిన మహజూజ్ డ్రాలో భారత ప్రవాసుడు అనీష్ 10 మిలియన్ దిర్హమ్స్(రూ.21కోట్లు) గెలుచుకున్నాడు. గడిచిన ఏడాది కాలంగా క్రమం తప్పకుండా మహజూజ్‌లో పాల్గొంటున్న అనీష్‌కు తాజాగా అదృష్టం వరించింది. శనివారం(జూలై 2న) దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఏకంగా రూ.21కోట్లు గెలుచుకున్నాడు. తాజాగా దుబాయ్‌లో మహజూజ్ ప్రధాన కార్యాలయంలో దీని తాలూకు చెక్‌ను రాఫెల్ నిర్వాహకులు అనీష్‌కు అందజేశారు. 


ఈ సందర్భంగా అనీష్ మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఇప్పటికీ తన ఫ్యామిలీ స్వదేశంలోనే ఉందని, వెంటనే వారిని యూఏఈకి తీసుకొచ్చి హ్యాపీగా ఉంటామని చెప్పాడు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అలాగే కొనసాగుతానని చెప్పిన అతడు.. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు. కానీ, తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన అప్పులు తీరడంతో పాటు తన పిల్లల భవిష్యత్ కూడా బాగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 


Updated Date - 2022-07-07T16:59:52+05:30 IST