అమెరికాలో భారత దంపతుల అనుమానాస్పద మృతి !

ABN , First Publish Date - 2021-04-09T17:20:44+05:30 IST

అమెరికాలోని న్యూజెర్సీలో భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మహారాష్ట్రాకు చెందిన బాలాజీ భరత్ రుద్రావర్(32), భార్య ఆర్తి బాలాజీ(30) న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్టన్‌లో గల వారి నివాసంలో బుధవారం విగతజీవులుగా కనిపించారు. వారి నాలుగేళ్ల కూతురు ఏడుస్తూ బాల్కనీలోకి రావడంతో గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

అమెరికాలో భారత దంపతుల అనుమానాస్పద మృతి !

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మహారాష్ట్రాకు చెందిన బాలాజీ భరత్ రుద్రావర్(32), భార్య ఆర్తి బాలాజీ(30) న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్టన్‌లో గల వారి నివాసంలో బుధవారం విగతజీవులుగా కనిపించారు. వారి నాలుగేళ్ల కూతురు ఏడుస్తూ బాల్కనీలోకి రావడంతో గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలాజీ ఇంటి తలుపు తీయడానికి ప్రయత్నించగా లోపలి నుంచి గడియా పెట్టి ఉండడం గమనించారు. దాంతో ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా దంపతులు రక్తపుమడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు.


వారి ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉండడం పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ ఇది హత్య? లేదా ఆత్మహత్య? అనే విషయంపై స్పష్టత రాదని పోలీసులు వెల్లడించారు. కాగా, మహారాష్ట్రాలోని బీద్ జిల్లాకు చెందిన బాలాజీ దంపతులు 2015, ఆగస్టులో అమెరికా వలస వెళ్లారు. బాలాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌గా పనిచేస్తున్నాడు. ఆర్తి ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ. ఇక బాలాజీ, ఆర్తి మృతితో వారి స్వస్థలంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి మృతదేహాలు స్వదేశానికి రావడానికి 8 నుంచి 10 రోజుల వరకు పడుతుందని సమాచారం. ప్రస్తుతం చిన్నారి న్యూజెర్సీలోని వారి స్నేహితుల వద్ద ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.  

Updated Date - 2021-04-09T17:20:44+05:30 IST