సింగపూర్‌లో భారతీయుడికి 41నెలల జైలు శిక్ష.. భారీ మొత్తంలో జరిమానా.. ఇంతకూ అతడు చేసిన నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-21T01:18:54+05:30 IST

సింగపూర్ కోర్టు భారతీయుడికి జైలు శిక్ష విధించింది. పెద్ద మొత్తంలో జరిమానా కూడా విధించింది. సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్‌పవర్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి

సింగపూర్‌లో భారతీయుడికి 41నెలల జైలు శిక్ష.. భారీ మొత్తంలో జరిమానా.. ఇంతకూ అతడు చేసిన నేరం ఏంటంటే..

ఎన్నారై డెస్క్: సింగపూర్ కోర్టు భారతీయుడికి జైలు శిక్ష విధించింది. పెద్ద మొత్తంలో జరిమానా కూడా విధించింది.  సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్‌పవర్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


భారత్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సింగపూర్ గత కొంత కాలంగా జైహో క్లబ్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ క్లబ్‌పై 2016మే 30న స్థానిక పోలీసు అధికారులు దాడులు జరిపారు. ఈ క్రమంలోనే క్లబ్‌లో ముగ్గురు మహిళలను గుర్తించిన అధికారులు విచారణ జరిపారు. దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఉద్యోగం పేరుతో ముగ్గురు మహిళలను బాలసుబ్రహ్మణ్యం ఆరు నెలల ఒప్పందంపై ఇండియా నుంచి తీసుకొచ్చినట్టు గుర్తించారు. 





అంతేకాకుండా అతడు వారికి డబ్బులు చెల్లించకపోవడంతోపాటు ఆ మహిళలపై దాడులకు పాల్పడ్డట్లు కనుగొన్నారు. మహిళల పాస్‌పోర్టులను బాలసుబ్రహ్మణ్యం స్వాధీనం చేసుకుని వారిని ఇబ్బందులకు గురిచేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు మానవ అక్రమ రవాణతోపాటు పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. బాలసుబ్రహ్మణ్యానికి 41నెలల జైలు శిక్ష విధించడంతోపాటు 27,365 సింగపూర్ డాలర్ల జరిమాన విధించింది. 


Updated Date - 2022-04-21T01:18:54+05:30 IST