ఆసియన్ వెయిట్లిఫ్టింగ్లో బంగారు పతకం మనదే
ABN , First Publish Date - 2021-04-19T11:59:22+05:30 IST
ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్కు చెందిన ఝిలీ దలబెహరా బంగారు పతకం సాధించింది. 45కేజీల విభాగంలో ఆమె ఈ పతకం గెలుచుకుంది. తొలుత స్నాచ్లో 69 కేజీలు ఎత్తిన ఝిలీ..
ఉజ్బెకిస్తాన్: ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్కు చెందిన ఝిలీ దలబెహరా బంగారు పతకం సాధించింది. 45కేజీల విభాగంలో ఆమె ఈ పతకం గెలుచుకుంది. తొలుత స్నాచ్లో 69 కేజీలు ఎత్తిన ఝిలీ.. ఆ తర్వాత క్లీన్ జెర్క్లో ఏకంగా 88 కేజీలు ఎత్తేసింది. మొత్తమ్మీద 157 కేజీలతో తొలిస్థానంలో నిలిచిన ఆమె బంగారు పతకం అందుకుంది. ఒలింపిక్ క్వాలిఫైయర్స్గా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ తరఫున మీరాబాయి చాను కాంస్య పతకం సాధించింది. ఝిలీ పతకంతో కలిపి భారత్ ఈ టోర్నీలో రెండు పతకాలు సాధించిందన్నమాట.