భారత్‌కు చెందిన వ్యక్తికి జైలు శిక్ష విధించిన దుబాయి కోర్టు!

ABN , First Publish Date - 2020-09-28T16:32:58+05:30 IST

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ భారతీయుడికి దుబాయి కోర్టు.. 6నెలల జైలు శిక్ష విధించింది. వి

భారత్‌కు చెందిన వ్యక్తికి జైలు శిక్ష విధించిన దుబాయి కోర్టు!

దుబాయి: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ భారతీయుడికి  దుబాయి కోర్టు.. 6నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కొంత కాలంగా బుర్ దుబాయిలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది జూన్‌లో అతను.. వ్యాయామం చేసుకుంటున్న మహిల వద్దుకు వెళ్లి, అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె శరీరంపై తాకుతూ.. అసభ్యంగా మాట్లాడాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో సదరు మహిళ.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అతని కోసం గాలించి పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి, జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసుపై దుబాయి కోర్టు విచారణ జరిపింది. తప్పు చేసినట్లు రుజువుకావడంతో.. అతనికి ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. 


Updated Date - 2020-09-28T16:32:58+05:30 IST