క‌రోనా కాటు.. బ‌హ్రెయిన్‌లో భార‌త వ్య‌క్తి మృతి !

ABN , First Publish Date - 2020-08-08T18:43:52+05:30 IST

మ‌హమ్మారి క‌రోనా కాటుతో బ‌హ్రెయిన్‌లో మ‌రో భార‌త వ్య‌క్తి మృతి చెందాడు.

క‌రోనా కాటు.. బ‌హ్రెయిన్‌లో భార‌త వ్య‌క్తి మృతి !

మ‌నామా: మ‌హమ్మారి క‌రోనా కాటుతో బ‌హ్రెయిన్‌లో మ‌రో భార‌త వ్య‌క్తి మృతి చెందాడు. మృతుడిని కేర‌ళ రాష్ట్రం అల‌ప్పుజా హ‌రిప‌ద్ క‌రిచ‌ల్‌కు చెందిన అజీంద్ర‌న్‌(53)గా గుర్తించారు. ఇటీవ‌ల కోవిడ్ బారిన ప‌డ్డ‌ అజీంద్ర‌న్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయాడు. అత‌నికి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉండ‌డంతో కోలుకోలేక‌పోయాడ‌ని అధికారులు పేర్కొన్నారు. ప‌దేళ్లుగా బ‌హ్రెయిన్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న‌ట్లు అత‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. అజీంద్ర‌న్‌కు భార్య గిరిజా, ఇద్ద‌రు కుమారులు అజిత్‌, అరుణ్ ఉన్నారు. 


ఇక బ‌హ్రెయిన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ 159 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. ప్ర‌స్తుతం దేశంలో 2,872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా మొత్తం 43,307 మంది క‌రోనా బారిన ప‌డ‌గా... 40,276 మంది కోలుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. 

Updated Date - 2020-08-08T18:43:52+05:30 IST