Tokyo Olympics 2020: క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత జట్టు

ABN , First Publish Date - 2021-07-29T13:56:27+05:30 IST

విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. మన్‌దీప్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు నేడు జరిగిన పుల్-ఏ మ్యాచ్‌లో ఏకంగా డిఫెడింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను కంగుతినిపించింది.

Tokyo Olympics 2020: క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత జట్టు

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. మన్‌దీప్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు నేడు జరిగిన పుల్-ఏ మ్యాచ్‌లో ఏకంగా డిఫెడింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను కంగుతినిపించింది. అర్జెంటీనాపై 3-1 గోల్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ తరఫున వరుణ్ కుమార్, వివేక్ ప్రసాద్, హార్మన్‌ప్రీత్ సింగ్ చేరో గోల్ చేశారు. ప్రత్యర్థి జట్టును మ్యాచ్ ఆరంభం నుంచే కట్టుదిట్టమై డిపెడింగ్‌తో కట్టడి చేసింది భారత్. దీంతో ఏ దశలోనూ భారత్‌పై అర్జెంటీనా పైచేయి సాధించలేకపోయింది. చివరకు 3-1 తేడాతో టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది.     



Updated Date - 2021-07-29T13:56:27+05:30 IST