సింగపూర్‌లో మృతి చెందిన భారత కార్మికుడు

ABN , First Publish Date - 2021-04-24T17:38:36+05:30 IST

భారత్‌కు చెందిన 28ఏళ్ల కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన సుగునన్ కొన్ని సంవత్సరాల క్రితం బతుకు

సింగపూర్‌లో మృతి చెందిన భారత కార్మికుడు

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 28ఏళ్ల కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన సుగునన్ కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం సింగపూర్ వెళ్లాడు. అక్కడే ఓ సంస్థలో చేరి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రోజు తన సహచరులతో కలిసి వర్క్‌సైట్‌కు లారీపై వెళ్తుండగా అది ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో లారీలో ప్రయాణిస్తున్న 16 మంది గాయపడ్డారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుగునన్ శుక్రవారం రోజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ బంగ్లాదేశ్‌కు చెందిన మరో కార్మికుడు కూడా మరణించినట్టు సింగపూర్ మీడియా పేర్కొంది. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. కాగా.. సుగునన్ తల్లి కూడా సింగపూర్‌లోనే డొమెస్టిక్ వర్కర్‌గా పని చేస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొడుకు మరణ వార్తను విని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. సుగునన్‌కు భార్య, 18 నెలల కూతురు ఉన్నారని తెలుస్తోంది. 


Updated Date - 2021-04-24T17:38:36+05:30 IST