2500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. నెలకు జీతం రూ.21,700

ABN , First Publish Date - 2021-10-19T16:10:03+05:30 IST

2500 పోస్టులకు నోటిఫికేషన్..

2500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. నెలకు జీతం రూ.21,700

ఇండియన్‌ నేవీ వివిధ పోస్టుల భర్తీకి అవివాహితులైన పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్(ఏఏ)

2. సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్ఎస్ఆర్‌)


అర్హత..

ఆర్టిఫిషర్‌ అప్రెంటి్‌స(ఏఏ): కనీసం 60 శాతం మార్కులతో మేథ్స్‌/ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత

సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్ఎస్ఆర్‌): కనీసం 60 శాతం మార్కులతో మేథ్స్‌/ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత


వయసు: 2002 ఫిబ్రవరి 01 నుంచి 2005 జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి

జీతభత్యాలు: శిక్షణ కాలంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ ఆధారంగా రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమంలో ఉంటుంది.


కోర్సు ప్రారంభం: ఫిబ్రవరి 2022

శిక్షణ వ్యవధి: ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ వారికి 9 వారాలు, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ అభ్యర్థులకు 22 వారాలు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 25

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in



Updated Date - 2021-10-19T16:10:03+05:30 IST