తన చెంపలు వాయగొట్టేందుకు మహిళను పనిలో పెట్టుకున్న భారతీయ అమెరికన్.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2021-11-14T03:04:44+05:30 IST

భారతీయ అమెరికన్ సీఈఓ సంచలన నిర్ణయం

తన చెంపలు వాయగొట్టేందుకు మహిళను పనిలో పెట్టుకున్న భారతీయ అమెరికన్.. ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు చూడనిదే రోజుగడవని పరిస్థతి. తొలుత అందరూ సరదా కోసమో లేక స్నేహితులతో టచ్‌లో ఉండేందుకే వీటిల్లో అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఆ తరువాత..తమకు తెలియకుండానే దానికి బానిసై పోతారు. ఇక ఆ తరువాత జీవితం మొత్తం తారుమారైపోతుంది. కొందరు తీవ్ర ఒత్తిళ్లకు కూడా లోనవుతుంటారు. అయితే.. చాలా మంది ఫేస్‌బుక్‌లో పడి సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఆ తరువాత పశ్చాత్తాపపడతారు. ఇంకోసారి ఇలా చేయద్దనుకుంటారు. మరుసటి రోజు మాత్రం సేమ్ సీన్ రిపీటవుతుంది. తన పరిస్థితి కూడా ఇలాగే తయారై వృత్తిపై మనసు పెట్టలేకపోతున్న ఓ ఎన్నారై భలే సరదా నిర్ణయం తీసుకున్నాడు. తను ఫేస్‌బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారీ చెంప పగలగొట్టేందుకు ఏకంగా మహిళను నియమించుకున్నాడు. ఇలాగైనా తనలో మార్పు వస్తుందేమోనని అతడి ఆశ. 


అమెరికాలో పావ్‌లోక్ అనే టెక్ సంస్థకు సీఈఓగా ఉన్న మనీష్ శేఠీ ఫేస్‌బుక్ నుంచి తనని తాను రక్షించుకునేందుకు ఇలా చేశాడు. అయితే..ఆయన ఊహించినట్టుగానే..తన పనితీరులో ఎంతో మార్పు వచ్చిందని , ఏకాగ్రతతో పని చేసుకోగలుగుతున్నాని చెప్పుకొచ్చాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..అతడు చెంప దెబ్బలు తింటుండగా తీసిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై ప్రముఖ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. దీంతో.. మనీష్ శేఠీ ప్రస్తుతం ఉబ్బితబ్బిబైపోతున్నాడు. మస్క్ దృష్టిలో పడటం కన్నా తనకు గర్వకారణం మరొకటి లేదని చెప్పుకొచ్చాడు. 



Updated Date - 2021-11-14T03:04:44+05:30 IST