Singaporeలో దారుణం భారత్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తి.. 15ఏళ్ల అమ్మాయితో శృంగారం.. తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కు అతడి మైండ్ బ్లాక్

ABN , First Publish Date - 2021-11-13T21:28:37+05:30 IST

భారత్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తి.. సింగపూర్‌లో దారుణానికి పాల్పడ్డాడు. 15ఏళ్ల అమ్మాయితో ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి, ఆ అమ్మాయితో శృంగారం చేశాడు. పని పూర్తైన తర్వాత ఆమెకు కొంత డబ్బును ఇచ్చి, అ

Singaporeలో దారుణం భారత్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తి.. 15ఏళ్ల అమ్మాయితో శృంగారం.. తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కు అతడి మైండ్ బ్లాక్

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తి.. సింగపూర్‌లో దారుణానికి పాల్పడ్డాడు. 15ఏళ్ల అమ్మాయితో ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి, ఆ అమ్మాయితో శృంగారం చేశాడు. పని పూర్తైన తర్వాత ఆమెకు కొంత డబ్బును ఇచ్చి, అక్కడ నుంచి పంపించేశాడు. అయితే తొలుత అతడు ఇచ్చిన డబ్బును తీసుకుని సైలెంట్‌గా వెళ్లిన ఆ అమ్మాయి.. సడన్‌గా ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అతడి మైండ్ బ్లాక్ అయింది. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


భారత్‌కు చెందిన పీ. అశోకన్ అనే 57ఏళ్ల వ్యక్తి గత కొన్నేళ్లుగా సింగపూర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆయన.. ఆన్‌లైన్ ద్వారా ఓ 15ఏళ్ల అమ్మాయికి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆమెకు అసభ్యకరమైన వీడియోలను పంపిస్తూ తనతో శృంగారంలో పాల్గొనాలని కోరాడు. అంతేకాకుండా డబ్బులు కూడా ఆఫర్ చేశాడు. దీంతో అందుకు ఆమె ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టంబర్ 1న ఇద్దరూ కలిసేందుకు స్థానికంగా ఉన్న హోటల్‌కు వెళ్లారు. అయితే హోటల్ సిబ్బంది.. అశోకన్‌ను ఐడీ ప్రూఫ్ కోరడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.



అనంతరం అతడు.. ఆ ఆమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో కలిసి శృంగారంలో పాల్గొన్న తర్వాత ఆ అమ్మాయికి 250 సింగపూర్ డాలర్లను ఇచ్చి పంపించాడు. కాగా.. తొలుత ఆ డబ్బులను తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆ అమ్మాయి.. సడన్‌గా ట్విస్ట్ ఇచ్చింది. అశోకన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో శృంగారంలో పాల్గొన్న సమయంలో సెక్స్ టాయ్‌లను కూడా ఉపయోగించినట్టు పేర్కొంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన కోర్టు.. 15ఏళ్ల అమ్మాయితో శృంగారంలో పాల్గొన్న కారణంగా అశోకన్‌కు 10 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఈ అంశం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2021-11-13T21:28:37+05:30 IST