సీషెల్స్ అధ్యక్షుడిగా భారత సంతతి పూజారి !
ABN , First Publish Date - 2020-10-26T18:11:35+05:30 IST
సీషెల్స్ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన భారతీయ సంతతి పూజారి వేవెల్ రామ్కలవన్ ఎన్నికయ్యారు.
విక్టోరియా(సీషెల్స్): సీషెల్స్ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన భారతీయ సంతతి పూజారి వేవెల్ రామ్కలవన్ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డానీ ఫౌర్ను ఆయన ఓడించారు. రామ్కలవన్ నేతృత్వంలోని లిన్యోన్ డెమోక్రాటిక్ సెసెల్వా(ఎల్డీఎస్) పార్టీ సీషెల్స్లో తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అలాగే 1977 నుంచి ఇప్పటివరకు సీషెల్స్లో ప్రతిపక్ష పార్టీకి అధికారం దక్కలేదు. రామ్కలవన్ ఎల్డీఎస్ పార్టీ ఈ సెంటిమెంట్కు స్వస్తి పలికి కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో మూడు దశాబ్దాల తర్వాత సీషెల్స్లో ఓ కొత్త పార్టీకి అధికారం దక్కినట్లైంది. ఈ ఎన్నికల్లో రామ్కలవన్కు 54.9 శాతం ఓట్లు వస్తే... డానీ ఫౌర్కు 43.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, 2015లో జరిగిన ఎన్నికల్లో రామ్కలవన్ కేవలం 193 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.