US: భారత సంతతి విద్యార్థి హత్య.. పోలీసుల అదుపులో రూమ్‌మేట్‌

ABN , First Publish Date - 2022-10-07T13:47:07+05:30 IST

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.

US: భారత సంతతి విద్యార్థి హత్య.. పోలీసుల అదుపులో రూమ్‌మేట్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 6: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో డేటాసైన్స్‌ చదువుతున్న వరుణ్‌ మనీశ్‌ చడ్డా(20) బుధవారం అర్ధరాత్రి వర్సిటీలోని మెక్‌-కట్చెన్‌ హాల్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. అతణ్ని పదునైన ఆయుధంతో పొడిచి, హతమార్చారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చడ్డా రూమ్‌మేట్‌, కొరియాకు చెందిన జీ మిన్‌ అలియాస్‌ జిమ్మీ షా అనే విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. తొలుత జిమ్మీ షానే 911కు ఫోన్‌ చేసి, చడ్డా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడంటూ సమాచారం అందించినట్లు తెలిపారు. 

Updated Date - 2022-10-07T13:47:07+05:30 IST