భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా సీట్లు ఇచ్చేందుకు గల్ఫ్ యూనివర్సిటీలు సిద్ధం!

ABN , First Publish Date - 2022-03-09T14:32:01+05:30 IST

భారత విద్యార్థులకు యూఏఈలోని కొన్ని యూనివర్సిటీలు తీపి కబురు చెప్పాయి. మధ్యలో ఆగిపోయిన చదువును పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపాయి. మెరిట్ ఆధారంగా ఉచితంగా సీట్లు, స్కాలర్‌షిప్‌లు అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి..

భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా సీట్లు ఇచ్చేందుకు గల్ఫ్ యూనివర్సిటీలు సిద్ధం!

ఎన్నారై డెస్క్: భారత విద్యార్థులకు యూఏఈలోని కొన్ని యూనివర్సిటీలు తీపి కబురు చెప్పాయి. మధ్యలో ఆగిపోయిన చదువును పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపాయి. మెరిట్ ఆధారంగా ఉచితంగా సీట్లు, స్కాలర్‌షిప్‌లు అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉక్రెయిన్‌-రష్యా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో వైద్య విద్యలాంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన భారత విద్యార్థులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి రప్పిస్తోంది. విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇండియాకు చేరుకున్నప్పటికీ వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత ప్రభుత్వం నిబంధనలను సవరిస్తే తప్ప అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ తమ చదువును పూర్తి చేసే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారత విద్యార్థులకు యూఏఈ యూనివర్సిటీలు తీపి కబురు చెప్పాయి. తమ యూనివర్సిటీల్లో చదువును కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపాయి. అంతేకాకుండా మెరిట్ ఆధారంగా ఉచితంగా సీట్లను ఇవ్వడంతోపాటు స్కాలర్‌షిప్‌లను కూడా అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.



ముఖ్యంగా తమ యూనివర్సిటీకి చెందిన అడ్మిషన్ కౌన్సెలర్లు.. విద్యార్థులు సాఫీగా బదిలీ అయి తమ కోర్సు పూర్తి చేయడానికి, వీసా, వసతి సౌకర్యాలు పొందేందుకు సహాయ సహకారాలు అందజేయనున్నట్టు గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. యూనివర్సిటీ ఫౌండర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డాక్టర్ తంబి మొయిదీన్ (Dr.Thumbay Moideen) మాట్లాడుతూ.. ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తోటి భారతీయులకు సహాయం చేయడం భారతీయుడిగా నా కర్తవ్యం. చదువు మధ్యలో ఆపేసి ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు తమ కలలను సహకారం చేసుకునేందుకు సహాయం అందిస్తాం’ అని పేర్కొన్నారు. మార్చి, 1957 మార్చిలో కర్నాటకలోని మంగళూరులో జన్మించిన Dr.Thumbay Moideen.. యూఏఈ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అనంతరం 1988లో గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీని ప్రారంభించారు.  




Updated Date - 2022-03-09T14:32:01+05:30 IST