అమెరికాలోనే మహిళ అంత్యక్రియలు.. భారత్‌ నుంచి లైవ్‌లో వీక్షించిన కుటుంబసభ్యులు

ABN , First Publish Date - 2022-03-14T02:06:16+05:30 IST

కరీంనగర్: అమెరికాలో వారం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన కందుకూరి విజయ(52) అంత్యక్రియలను అక్కడే నిర్వహించారు.

అమెరికాలోనే మహిళ అంత్యక్రియలు.. భారత్‌ నుంచి లైవ్‌లో వీక్షించిన కుటుంబసభ్యులు

కరీంనగర్: అమెరికాలో వారం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన కందుకూరి విజయ(52) అంత్యక్రియలను అక్కడే నిర్వహించారు. మల్యాల మండల కేంద్రానికి చెందిన కందుకూరి అశోక్‌ అతడి భార్య విజయ నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో కార్డోవ పట్టణంలో పనిచేస్తున్నారు. ఈ నెల 10న విజయ రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీకొని మృతి చెందింది. అంతకుముందే ఆమె పాస్‌పోర్టు చోరీకి గురికావడంతో మృతదేహం ఇండియా రావడానికి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10గంటలకు అమెరికాలో విజయ అంత్యక్రియలను భర్త అశోక్‌ చేశాడు. ఈ కార్యక్రమాన్ని వీడియోకాల్‌ ద్వారా మల్యాలలో ఉన్న ఆమె ఇద్దరు కొడుకులు, కుటుంబసభ్యులు, లైవ్‌లో వీక్షించి కన్నీటి వీడ్కోలు పలికారు. 

Updated Date - 2022-03-14T02:06:16+05:30 IST