క్రీడాస్ఫూర్తి.. పాక్ కెప్టెన్ కూతురుతో భారత క్రికెటర్లు

ABN , First Publish Date - 2022-03-06T23:31:35+05:30 IST

భారత్-పాక్‌ల మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. రెండు దేశాలు క్రికెట్‌లో తలపడుతున్నాయంటే, ప్రజల్లో ఉండే భావోద్వేగాలు అంతాఇంతా కాదు. అయితే, ఇరు దేశాల మధ్య ఆటల్లో పోటీ ఉన్నా, ఆటగాళ్లు మాత్రం ఒకరినొకరు గౌరవించుకుంటారు.

క్రీడాస్ఫూర్తి.. పాక్ కెప్టెన్ కూతురుతో భారత క్రికెటర్లు

భారత్-పాక్‌ల మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. రెండు దేశాలు క్రికెట్‌లో తలపడుతున్నాయంటే, ప్రజల్లో ఉండే భావోద్వేగాలు అంతాఇంతా కాదు. అయితే, ఇరు దేశాల మధ్య ఆటల్లో పోటీ ఉన్నా, ఆటగాళ్లు మాత్రం ఒకరినొకరు గౌరవించుకుంటారు. ముఖ్యంగా భారతీయ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తి చాటుతారు. తాజాగా భారతీయ మహిళా క్రికెట్ టీమ్ సభ్యులు క్రీడాస్ఫూర్తి చాటుకున్నారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత క్రికెటర్లు పాక్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ కూతురు ఫాతిమాతో భారతీయ క్రికెటర్లు సరదాగా గడిపారు. ఆరు నెలల వయసున్న ఆ బేబీని ఎత్తుకుని ఆడించారు. తనతో ఫొటోలు దిగి కాస్సేపు సంతోషంగా టైమ్ స్పెండ్ చేశారు. భారతీయ క్రికెటర్లు చేసిన ఈ పనిపై క్రీడాలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారంటూ అభినందిస్తున్నారు. పాక్ కెప్టెన్ బిస్మా తన ఆరు నెలల కూతురుతోనే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడం విశేషం.

Updated Date - 2022-03-06T23:31:35+05:30 IST