కరోనా కాలంలో భారత్‌కు అండగా డాక్టర్ల బృందం

ABN , First Publish Date - 2021-05-10T16:59:02+05:30 IST

ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలతోపాటు విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా భారత్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ డా

కరోనా కాలంలో భారత్‌కు అండగా డాక్టర్ల బృందం

ముంబై: ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలతోపాటు విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా భారత్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ డాక్టర్ల బృందం, ఇతర స్వచ్ఛంధ సంస్థలు ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌తో కలిసి పని చేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు వైద్య పరికరాలను అందిస్తున్నాయి. ఆదివారం రోజు దాదాపు 3,800 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ముంబై, ఢిల్లీలోని విమానాశ్రయాలకు చేరుకున్నాయి. వీటిని 15 రాష్ట్రాల్లోని 40 ఆసుపత్రులకు తరలించనున్నారు. ఇవి కాకుండా మరో 1500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు త్వరలో ఇండియాకు చేరనున్నాయి. కాగా.. టాటా మెమోరియల్ సెంటర్ డెరెక్టర్ డాక్టర్ రాజేంద్ర బాద్వే మాట్లాడుతూ.. ఇండియన్ డయాస్పుర 10 రోజుల్లోనే దాదాపు 5వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. వీటిని సుమారు దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 200 ఆసుపత్రులకు అందజేసినట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-10T16:59:02+05:30 IST