ఆదివాసులకు సంస్కృతి, సంప్రదాయాలతోనే గుర్తింపు
ABN , First Publish Date - 2022-01-21T04:15:23+05:30 IST
ఆదివాసులకు సంస్కృతి, సంప్రదాయాలతోనే గుర్తింపు వస్తుందని మాజీ ఎంపీ గెడెం నగేష్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. గురువారం మండలంలోని గడల పల్లి గ్రామపంచాయతీలో పాహండి కుపార్ లింగో కట్ ముండా మట్టి పూజాను ఆది వాసులు ఘనంగా నిర్వహించారు.
తిర్యాణి, జనవరి 20: ఆదివాసులకు సంస్కృతి, సంప్రదాయాలతోనే గుర్తింపు వస్తుందని మాజీ ఎంపీ గెడెం నగేష్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. గురువారం మండలంలోని గడల పల్లి గ్రామపంచాయతీలో పాహండి కుపార్ లింగో కట్ ముండా మట్టి పూజాను ఆది వాసులు ఘనంగా నిర్వహించారు. ముం దుగా ఆదివాసులకు సంప్రదాయ బద్దంగా పావన్ మడుగులోని దేవతా మూర్తులకు పూజలు నిర్వహించి అనంతరం సభ స్థలం లోని ఏర్పాటు చేసిన జెండాకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులో ముందు ఉంటూ సంస్కృతీ సంప్రదా యాలు జాతిపట్ల సేవాభావం కలిగి ఉండాలని సూచించారు. తిర్యాణి మండలంలో ఉన్న ఆదివా సులకు సంబంధించిన దేవాలయాలను అభివృద్ధి పరచాలని ఈ సందర్భంగా ఆదివాసీలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అర్జు మాస్టర్, రేలారే రవి, వికాస్, ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ చంద్రశేఖర్, సర్పంచ్లు గుణవంతరావు, ఓపాల్, గణపతి, అర్చన పాల్గొన్నారు.