సెలవుపై Indigo సిబ్బంది...
ABN , First Publish Date - 2022-07-11T00:59:18+05:30 IST
ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందిలో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సిబ్బంది సహా టెక్నీషియన్లు సెలవుపై వెళ్ళినట్లు వినవస్తోంది.
న్యూఢిల్లీ : ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందిలో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సిబ్బంది సహా టెక్నీషియన్లు సెలవుపై వెళ్ళినట్లు వినవస్తోంది. వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ ఇండిగో సిబ్బంది నిరసనలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... హైదరాబాద్, ఢిల్లీల్లోని సిబ్బంది అనారోగ్యం కారణంతో సెలవుపై వెళ్లినట్లు సంబంధిత వర్గాలు ఆదివారం వెల్లడించాయి.
ఈ నెల(జూలై) 2 వ తేదీన ఇండిగో క్యాబిన్ సిబ్బంది పెద్దసంఖ్యలో సెలవు తీసుకున్నందున, ఇండిగో దేశీయ విమానాలలో 55 శాతం ఆలస్యమయ్యాయి, కాగా... ఆ సిబ్బంది ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్కు వెళ్లినట్లు పరిశ్రమలోని వర్గాలు రెండు రోజుల క్రితమే వెల్లడించిన విషయం తెలిసిందే. COVID-19 మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఇండిగో తన ఉద్యోగులలో చాలా మంది ఉద్యోగుల జీతాలను తగ్గించిన విషయం తెలిసిందే.
కొత్త ఎయిర్లైన్ అకాసా ఎయిర్, పునరుద్ధరించిన జెట్ ఎయిర్వేస్, టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నియామక ప్రక్రియలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... ఇండిగో విమానయాన సంస్థలో ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. తక్కువ వేతనాలను నిరసిస్తూ గత రెండు రోజులుగా, ఇండిగో టెక్నీషియన్లు నిరసన వ్యక్తం చేస్తూ, అనారోగ్య సెలవుపై వెళ్లారని వర్గాలు చెబుతున్నాయి.