ఇండిగో రూ.3000 కోట్లు సమీకరణ
ABN , First Publish Date - 2021-05-11T05:45:15+05:30 IST
సంస్థాగత ఇన్వెస్టర్ల వాటాలు విక్రయించడం ద్వారా రూ.3 వేల కోట్ల నిధులు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డు అనుమతించిందని ఇండిగో ఎయిర్లైన్స్ మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్...
ముంబై : సంస్థాగత ఇన్వెస్టర్ల వాటాలు విక్రయించడం ద్వారా రూ.3 వేల కోట్ల నిధులు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డు అనుమతించిందని ఇండిగో ఎయిర్లైన్స్ మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ తెలిపింది. ప్రయాణికుల డిమాండు తగ్గడంతో పాటు ఆక్యుపెన్సీ రేటు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కంపెనీ నిధుల సమీకరణ నిర్ణయం తీసుకుంది. 2020 డిసెంబర్ 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.620 కోట్ల నికర నష్టం ప్రకటించిన విషయం విదితమే. మార్చి త్రైమాసికం ఫలితాలు ఇంకా ప్రకటించవలసి ఉంది.
ఎస్బీఐ కార్డ్స్ బాండ్లరీ: బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.455 కోట్లు సమీకరించినట్టు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.10 లక్షల ముఖవిలువ గల బాండ్లను 5.70 శాతం వడ్డీపై ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన జారీ చేయనున్నట్టు తెలిపింది.