అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధన తొలగించిన ఇండోనేషియా!
ABN , First Publish Date - 2022-03-23T03:11:26+05:30 IST
కరోనా సంక్షోభం నెమ్మదిస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు ఆంక్షలకు తెరదించుతున్న విషయం తెలిసిందే. ఈ దిశలో ఇండోనేషియా కూడా వేగంగా ముందడుగు వేస్తోంది.
ఎన్నారై డెస్క్: కరోనా సంక్షోభం నెమ్మదిస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు ఆంక్షలకు తెరదించుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఇండోనేషియా కూడా వేగంగా ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో.. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ ప్రయాణికులు..తప్పనిసరిగా క్వారంటైన్కు పరిమితమవ్వాలన్న నిబంధనను తొలగిస్తున్నట్టు అక్కడి పర్యాటక శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు.
కాగా.. బాలీ, బాటామ్, బింటాన్ ద్వీపాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు టీకా తీసుకున్న పక్షంలో క్వారంటైన్ ఉండదని ఇండోనేషియా చెప్పిన విషయం తెలిసిందే. ఈ మినహాయింపును నెల రోజుల పాటు విజయవంతంగా అమలు చేసిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మరిన్ని సడలింపులకు పూనుకుంది.