ఇంద్రాణీ ముఖర్జియా సహా 40 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-21T20:25:22+05:30 IST

షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా సహా బైకుల్లా జైల్లోని 40 మంది ఖైదీలు...

ఇంద్రాణీ ముఖర్జియా సహా 40 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్

ముంబై: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా సహా బైకుల్లా జైల్లోని 40 మంది ఖైదీలు కరోనా బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. వీరందర్నీ ఓ క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్టు తెలిపారు. ‘‘ఈ 40 మందిలో చాలామందికి కరోనా లక్షణాలు కనిపించడంలేదు. ముందు జాగ్రత్తగా వీరిని బైకుల్లా జైలుకు చెందిన పతంకర్ పాఠశాలలో ఐసొలేషన్‌లో ఉంచాం..’’ అని సదరు అధికారి వెల్లడించారు. దీంతో పాటు 40 మంది మినహా మిగతా ఖైదీలు, జైలు సిబ్బంది మొత్తానికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు (ఆర్ఏటీ) చేయించారు. 2015 ఆగస్టులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా... అప్పటి నుంచి బైకుల్లా జైల్లోనే ఉన్నారు.  

Updated Date - 2021-04-21T20:25:22+05:30 IST