టీడీపీలోకి పారిశ్రామికవేత్త గంటా
ABN , First Publish Date - 2022-07-02T09:05:53+05:30 IST
టీడీపీలోకి పారిశ్రామికవేత్త గంటా
రాజంపేట ఎంపీ అభ్యర్ధి అని పార్టీ వర్గాల్లో ప్రచారం
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి శుక్రవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బెంగుళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన 17-18 సంవత్సరానికి రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకొన్నారు. తన వ్యాపార కార్యకలాపాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు సమీప బంధువు. డీకే సతీమణి, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సోదరికి నరహరి అల్లుడు అవుతారు. రాజంపేట లోక్సభ స్థానానికి ఆయన టీడీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరెడ్డి, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, బత్యాల చెంగల్రాయుడు, దమ్మాలపాటి రమేశ్, చల్లా బాబు రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.