12వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ABN , First Publish Date - 2022-07-06T05:36:33+05:30 IST
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి 12963 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
క్రమంగా పెరుగుతున్న శ్రీరామసాగర్ నీటిమట్టం
మెండోర, జూలై 5: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి 12963 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎస్కెప్ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 445క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కులు ఔట్ఫ్లో పోతుందని వివరించారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90టీఎంసీ) నీటి నిల్వ కాగా మంగళవారం సాయంత్రం 1069.1 అడుగులు (27.172టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని వివరించారు. గత ఏడాది ఇదే రోజున 1070.4అడుగులు (29.772టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని, జూన్ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 9.018 టీఎంసీల నీరు వచ్చి చేరిందని తెలిపారు.