రూ 2.23 కోట్లతో లేఅవుట్‌లో మౌలిక వసతులు

ABN , First Publish Date - 2022-01-22T04:49:09+05:30 IST

తిక్కవానిపాలెం, ముత్యాలమ్మపాలెం, నాయుడుపాలెం, వాడచీపురుపల్లి పంచాయతీలకు సంబంధించి గృహ లబ్ధిదారులకు తిక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో రూ.2.23 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తెలిపారు.

రూ 2.23 కోట్లతో లేఅవుట్‌లో మౌలిక వసతులు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

పరవాడ, జనవరి 21: తిక్కవానిపాలెం, ముత్యాలమ్మపాలెం, నాయుడుపాలెం, వాడచీపురుపల్లి పంచాయతీలకు సంబంధించి గృహ లబ్ధిదారులకు తిక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో రూ.2.23 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తెలిపారు. శుక్రవారం ఆయా పంచాయతీల గృహ లబ్ధిదారులతో తిక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లేఅవుట్‌ చదునుతో పాటు రహదారులు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్టు తెలిపారు. అంతకు ముందు ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారులతో లేఅవుట్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలా వెంకటపద్మలక్ష్మి శ్రీనివాస్‌, జడ్పీటీసీ పైలా సన్యాసిరాజు, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీ బూస అప్పలరాజు, సర్పంచ్‌లు చింతకాయల సుజాత ముత్యాలు, చేపల మసేను, కూండ్రపు వరలక్ష్మిసీతారామయ్య, ఎంపీటీసీలు అర్జిల్ల దేవి, సూరాడ బంగ్రారాజు, కో ఆప్షన్‌ సభ్యుడు మైలపల్లి అప్పన్న, హౌసింగ్‌ డీఈ రాజు, ఏఈ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T04:49:09+05:30 IST