సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2022-05-22T04:34:42+05:30 IST
మండలంలోని గోలేటి గ్రామ సర్పంచిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ శనివారం గోలేటి టౌన్షిప్లోని బస్టాండు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను చేపట్టారు.
రెబ్బెన, మే 21: మండలంలోని గోలేటి గ్రామ సర్పంచిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ శనివారం గోలేటి టౌన్షిప్లోని బస్టాండు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అంజనేయులుగౌడ్ మాట్లాడుతూ గ్రామపం చాయతీ నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల న్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధ్రుతం చేసి, సర్పంచి ఇంటిని ముట్టడిస్తామన్నారు. నిరాహార దీక్షలో బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి, అసెంబ్లీ ఇన్చార్జీ ఆత్మరాంనాయక్, కన్వీనర్ సొల్లు లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి, రాజేందర్, జగన్నాథ్, ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.