కొవిడ్ వ్యాక్సినేషన ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-17T06:17:22+05:30 IST
ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ కొందరి ప్రాణాలను బలికొన్న వైర్సకు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం చేసిన కృషి ఫలించిందని ఇక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ అందరికి కరోనా టీకా ఇస్తామని ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.
పుట్టపర్తి, జనవరి 16: ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ కొందరి ప్రాణాలను బలికొన్న వైర్సకు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం చేసిన కృషి ఫలించిందని ఇక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ అందరికి కరోనా టీకా ఇస్తామని ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సత్యసాయి సూపర్ ఆస్పత్రిలో ట్రస్టు సభ్యులు ఆర్జే రత్నాకర్తో కలిసి కరోనా టీకాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీకాను తయారుచేయడం శుభపరిణామమని, ఇక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పలువురు వైద్యసిబ్బందికి టీకాను వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజునాయక్, సూపర్ ఆస్ప త్రి వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.