డ్రోన్ ద్వారా భూముల రీసర్వేకి శ్రీకారం
ABN , First Publish Date - 2021-03-07T04:44:15+05:30 IST
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేకి మండలంలో శ్రీకారం చుట్టారు.
కొండాపురం, మార్చి 6: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేకి మండలంలో శ్రీకారం చుట్టారు. ఇందుకు కోసం మండలంలోని లింగమనేనిపల్లె గ్రామాన్ని పైలట్ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా శనివారం భూముల రీసర్వేకి శ్రీకారం చుట్టినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద లింగమనేనిపల్లె గ్రామాన్ని తీసుకున్నామన్నారు. ఆ తర్వాత మిగిలిన గ్రామాలకు కూడా సర్వే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ సునిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.