విద్యుదాఘాతంతో యువతికి గాయాలు
ABN , First Publish Date - 2021-02-26T04:21:13+05:30 IST
మండలంలోని మంథన్గోడ్ గ్రామంలో ఓ యువతి విద్యుదాఘాతంతో గాయపడ్డ సంఘటన గుర వారం చోటు చేసుకుంది.
మక్తల్రూరల్, ఫిబ్రవరి 25 : మండలంలోని మంథన్గోడ్ గ్రామంలో ఓ యువతి విద్యుదాఘాతంతో గాయపడ్డ సంఘటన గుర వారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హన్మంతు, మొగిలమ్మల కూతురు నర్సింగమ్మ(18) తన ఇంట్లో సెల్ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్షాక్కు గురై కిందపడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.