రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు

ABN , First Publish Date - 2021-11-30T05:10:00+05:30 IST

మండలంలోని రాజులకల్లాలు జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు

 శృంగవరపుకోట రూరల్‌, నవంబరు 29: మండలంలోని రాజులకల్లాలు జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.  వివరాలిలా ఉన్నాయి. రాజీపేట గ్రామానికి చెందిన చెల్లయ్యమ్మ సోమవారం విశాఖ-అరకు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న తన పొలంలోకి వెళ్లేందుకు రోడ్డు  దాటుతుండగా, విశాఖ జిల్లా అనంతగిరి నుంచి వస్తున్న బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాళ్లు దెబ్బతినగా, చేతులపై గాయాలయ్యాయి. ఈమెను స్థానికులు ఎస్‌.కోట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎటువం టి ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ ప్రసన్నకుమార్‌ తెలిపారు.

 

Updated Date - 2021-11-30T05:10:00+05:30 IST