దాడిలో బట్టల వ్యాపారికి గాయాలు
ABN , First Publish Date - 2021-04-24T04:50:04+05:30 IST
పట్టణానికి చెందిన జానపాటి గో పాల్ అనే బట్టల వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు.
ప్రొద్దుటూరు క్రైం, ఏప్రిల్ 23 : పట్టణానికి చెందిన జానపాటి గో పాల్ అనే బట్టల వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మూడవ పట్టణ పోలీస్స్టేషన్ పరిధి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శుక్రవారం ఉద యం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... స్థానికంగా బట్ట ల వ్యాపారం నిర్వహించే జానపాటి గోపాల్ వాకింగ్ కోసం రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి వెళ్లారు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కర్రలతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గోపాల్ను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ సీఐ గంటా సుబ్బారావు, ఆస్పత్రికి చేరుకుని గోపాల్ను విచారించగా తనకు, సినీహబ్ అధినేత రాజేశ్వర్రెడ్డికి ఆర్థికపరమైన లావాదేవీల్లో విభేదాలు ఉన్నాయని తెలి పారు. ఈ కారణంగానే వారే ఈ చర్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంటా సుబ్బారావు తెలిపారు.