తెలంగాణ వచ్చిన తర్వాతే అన్యాయం

ABN , First Publish Date - 2021-03-02T05:57:40+05:30 IST

‘ఉమ్మడి రాష్ట్రంలో హాయిగా ఉన్నాం... తెలంగాణ వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం వివక్ష మాని అన్ని పత్రికలకు ప్రకటనలు ఇవాలి’ అని తెలం గాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మ్యాగజైన్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

తెలంగాణ వచ్చిన తర్వాతే అన్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న అసోసియేషన్‌ అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు

 ఉమ్మడి రాష్ట్రంలోనే భాగున్నాం

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం

  సాగర్‌ ఉప ఎన్నికలో 200మంది పోటీ

పంజాగుట్ట, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ‘ఉమ్మడి రాష్ట్రంలో హాయిగా ఉన్నాం... తెలంగాణ వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం వివక్ష మాని అన్ని పత్రికలకు ప్రకటనలు ఇవాలి’ అని తెలం గాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మ్యాగజైన్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా, నాగార్జునసాగర్‌  ఉప ఎన్ని కలో చిన్న పత్రికల సంపాదకులు, జర్నలిస్టులు, న్యాయవాదులు కలిపి మొత్తం 200మంది  పోటీ చేయనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు అగస్టీన్‌, కోశాధికారి ఆజామ్‌ఖాన్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రకటనలు నిలిపివేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో అధికారులది ఇష్టారాజ్యంగా మారిందని, అడుగడుగునా అవినీతి రాజ్యమేలు తోందన్నారు. ఇప్పటి వరకు సమాచార శాఖకు కమిషనర్‌ లేర న్నారు. ప్రభుత్వం కళ్లు తెరచి తమ గోడును పట్టించుకోవాలని, వివక్ష మాని అన్ని పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించుకున్నామని, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామన్నారు. నామినేషన్ల సమయంలో  నల్గొండ నుంచి సాగర్‌ వరకు చిన్న పత్రికల సంపాదకులు, జర్నలిస్ట్‌లతో భారీ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బంగారు తెలం గాణలో జర్నలిస్టుల బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తామ న్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:57:40+05:30 IST