వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం

ABN , First Publish Date - 2022-06-30T05:30:00+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ లీగల్‌ సెల్‌ మాజీ అధ్యక్షుడు పరిటాల సురేష్‌ అన్నారు.

వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం
గ్రామస్థులతో మాట్లాడుతున్న సురేష్‌

వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం

కురిచేడు, జూన్‌ 30:  వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ లీగల్‌ సెల్‌ మాజీ అధ్యక్షుడు పరిటాల సురేష్‌ అన్నారు. పరిటాల పల్లెబాట కార్యక్రమం 56వ రోజు కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం, ముష్ట్లగంగవరం గ్రా మాలలో గురువారం జరిగింది. పడమర నాయుడుపాలెం గ్రామంలో జ రిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌, బీసీ నాయకులు గడ్డం బాలయ్య మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీసీలకు అన్నిరకాల సహాయాలు అందాయని గుర్తు చేశారు. నేడు విపరీతంగా దాడులు పెరిగాయన్నారు. ముస్లింలకు ఉపయెగపడే దుల్హన్‌ పథకాన్ని రద్దుచేయడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికా రంలోకి రావడం అత్యవసరమన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్య మంత్రిగా చేయడంద్వారా రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని ప్రజలను కో రారు. కార్యక్రమంలో రెండు గ్రామాల టీడీపీ నాయకులు గంధం గురునాథం, షేక్‌ కాసిం, మస్తాన్‌ వలి, గడ్డం చిన్న గురునాథం, గోసుల వెం కటేశ్వర్లు, పునుగుపాటి రామారావు, ఉన్నగిరి వెంకటేశ్వర్లు, నాగరాజు, షేక్‌ ఈసుబ్‌, గుమ్మా పాలంకయ్య  పాల్గొన్నారు. 

అంతా అరాచకమే..

ముండ్లమూరు : వైసీపీ అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల కాలంలో అభివృద్ధి కంటే అరాచకాలే ఎక్కువ అని  పరిటాల సురేష్‌ అ న్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం మండలంలోని తూర్పుకంభంపాడు, నూజెండ్లపల్లి, సుంకరవారిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ యన కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రం లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ గ్రామం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు, ఇళ్లపై దాడులకు తెగబడుతు న్నార న్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూ ములు అక్రమంగా లాక్కోవడం, అదేమని అడి గితే  కేసులు పెట్టి భయపెడుతున్నార న్నారు. మద్య నిషేధమని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి నాసిరకం మందును అమ్మ తూ కోట్లాది రూపాయలు దోచుకుంటు న్నార ని ఆరోపించారు. కల్తీ మద్యం తాగి అమాయ కులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.   ము ఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పని చేసి న కాలంలో పోలవరాన్ని, అమరావతిని అభి వృద్ధి చేస్తే జగన్‌రెడ్డి మూడేళ్లలో వాటి రూపు రేఖలు లేకుండా విధ్వంసం చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుబ్బారావు, మానం నాగేశ్వరరావు, చాగంటి హనుమంతరావు, కిలారి హనుమంతరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:30:00+05:30 IST