బైడెన్ హయాంలో తొలిసారి.. 19 ఏళ్ల జైలు తర్వాత ఖైదీ విడుదల

ABN , First Publish Date - 2021-07-20T09:55:54+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన మిలటరీ జైల్లో 19 సంవత్సరాలుగా మగ్గిపోతున్న ఖైదీకి స్వేచ్ఛ లభించింది. అతన్ని

బైడెన్ హయాంలో తొలిసారి.. 19 ఏళ్ల జైలు తర్వాత ఖైదీ విడుదల

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన మిలటరీ జైల్లో 19 సంవత్సరాలుగా మగ్గిపోతున్న ఖైదీకి స్వేచ్ఛ లభించింది. అతన్ని విడుదల చేయడానికి బైడెన్ సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో అబ్దుల్ లతీఫ్ నాజిర్ అనే ఖైదీని గాంటానామో జైలు నుంచి విడుదల చేశారు. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్ పాలక వర్గం వెల్లడించింది. మొరాకోకు చెందిన నాజిర్.. 2002 నుంచి ఈ జైల్లో ఉంటున్నాడు. 2016లోనే అతన్ని విడుదల చేయడానికి అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వ అనుమతి రాకపోవడంతో అతను జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బైడెన్ సర్కారు అతనికి అనుమతి ఇవ్వడంతో అతన్ని జైలు నుంచి విడుదల చేయడం జరిగింది. బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత జైలు నుంచి విడుదలైన తొలి ఖైదీ నాజిరే  కావడం గమనార్హం.

Updated Date - 2021-07-20T09:55:54+05:30 IST