యాంత్రీకరణ అమలులో అవకతవకలపై ఉన్నతాధికారుల విచారణ
ABN , First Publish Date - 2021-03-06T04:56:22+05:30 IST
వ్యవసాయశాఖలో పదేళ్ల క్రితం జరిగిన యాంత్రీకరణ అమలు లో అవకతవకలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆ శాఖ అదనపు డైరె క్టర్ జిల్లా కార్యాలయానికి వచ్చి తనిఖీలు చేశారు.
నిజామాబాద్, మార్చి 5: (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వ్యవసాయశాఖలో పదేళ్ల క్రితం జరిగిన యాంత్రీకరణ అమలు లో అవకతవకలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆ శాఖ అదనపు డైరె క్టర్ జిల్లా కార్యాలయానికి వచ్చి తనిఖీలు చేశారు. అప్పుడు జరిగిన ఫార్మ్ మెకనైజేషన్కు వెచ్చించిన నిధుల వివరాలను పరిశీలించారు. ఐ దుగురు ఏవోల పరిధిలో జరిగిన అవకతవకలపైన విచారణ చేపట్టా రు. ఆ సమయంలో యాంత్రీకరణ ద్వారా యంత్రాలను కొని అందించడంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. జిల్లాలో 2010 నుంచి 2012 మ ధ్య జరిగిన ఈ పనులపైన ప్రస్తుతం విచారణను కొనసాగిస్తున్నారు. వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్ శుక్రవారం జేడీఏ కార్యాలయా నికి వచ్చి విచారణ చేపట్టారు. అప్పటి రికార్డులను పరిశీలించారు. ఆ అధికారుల పరిధిలో పథకం అమలుతీరు వివరాలను తెలుసుకున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఏయే మండలాల్లో యాంత్రీకరణ కోసం నిధులు ఖర్చు పెట్టారో పరిశీలించారు. తమ నివేదికను వ్యవసాయశాఖ కమిషనర్ కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తుపైన అధికారులు మాత్రం వివరాలను వెల్లడించలేదు.