ఉపాధి బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-08-24T22:21:13+05:30 IST

జాతీయ ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో

ఉపాధి బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ

అమరావతి: జాతీయ ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. కోర్టుకు ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్‌ఎస్‌ రావత్ హాజరయ్యారు. ఇప్పటికే 400కోట్లు చెల్లించామని, మరో వారం రోజుల్లో 1100 కోట్ల బిల్లులు చెల్లిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. పంచాయతీల ఎకౌంట్లలో డబ్బులు జమ చేశామని అధికారులు తెలిపారు. దీతో న్యాయవాదులు వీరారెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్‌, నర్రా శ్రీనివాస్‌ అభ్యంతరం తెలిపారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ధర్మాసనం దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. పంచాయతీ ఎకౌంట్లలో కాకుండా కాంట్రాక్టర్‌కు చెల్లించి ఆ వివరాలను హైకోర్టుకు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది.


విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. కేంద్రం నుంచి ఇంకా డబ్బు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం  తెలిపింది. తాము మొత్తం డబ్బు ఇచ్చామని పెండింగ్ లేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఎన్ని పనులు చేశారు, ఇంకా ఎంత రావాలన్న వివరాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 22కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-08-24T22:21:13+05:30 IST