జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌పై ఎన్జీటీలో విచారణ

ABN , First Publish Date - 2022-02-04T23:50:08+05:30 IST

హైదరాబాద్‌లోని జవహర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంపై

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌పై ఎన్జీటీలో విచారణ

ఢిల్లీ: హైదరాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. మూడు ప్రత్యామ్నాయ డంపింగ్ యార్డ్‌లను గుర్తించామని ప్రభుత్వం చెబుతున్నా డంపింగ్‌ యార్డ్‌ను కొనసాగిస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారని ఎన్జీటి ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బయో మైనింగ్ చేయాలని ఎన్జీటీ సూచించింది. సీపీసీబీ ఇచ్చిన నివేదికపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 

Updated Date - 2022-02-04T23:50:08+05:30 IST