శింగరకొండ ఆలయంలోని సంఘటనలపై విచారణ
ABN , First Publish Date - 2021-11-27T06:20:45+05:30 IST
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై విచారణకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం జాయింట్ కమిషనర్, ఈవో భ్రమరాంబను నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్ ఉత్తర్వులు ఇచ్చారు.
జాయింట్ కమిషనర్ నియామకం
ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన
అద్దంకి, నవంబరు26: శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై విచారణకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం జాయింట్ కమిషనర్, ఈవో భ్రమరాంబను నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో ఈ నెల 3 వ తేదీ శింగరకొండలో ఆధిపత్య పోరు అనే కథనం ప్రచురితం కావటం, దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చైర్మన్ కోట శ్రీనివాసకుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేయడం విదితమే. దీనిపై చైర్మన్, ఈవో ఎవరికి వారే ప్రజా ప్రతినిధులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఎవరి వాదనలు వారు వినిపించారు. ఈ నేపఽథ్యంలో శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో జరిగిన సంఘటనలపై విచారించేందుకు విజయవాడ దుర్గామల్లేశ్వరి దేవస్థానం ఈవో, జాయింట్ కమిషనర్ భ్ర మరాంబను విచారణాధికారిగా నియమించారు. డిసెంబరు 1 వ తేదీలోపు విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. రెండు,మూడు రోజులలో విచారణ కు కమిషనర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.