వంతెన నిర్మాణ పనులు పరిశీలన

ABN , First Publish Date - 2022-05-22T04:26:56+05:30 IST

మండలంలోని ఏదులబంధం వద్ద తుంతుంగ వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పరిశీ లించారు.

వంతెన నిర్మాణ పనులు పరిశీలన
వంతెన పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుమన్‌ తదితరులు

కోటపల్లి, మే 21: మండలంలోని ఏదులబంధం వద్ద తుంతుంగ వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పరిశీ లించారు. రూ.8 కోట్లతో వంతెన పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. బ్రిడ్జి అందుబాటులోకి రానుండడం తో ఈ వర్షాకాలంలో ఏదులబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆల్గామ, జనగామ, వెంచపల్లి గ్రామాల ప్రజల కష్టాలు తొలగిపోనున్నాయన్నారు.  పిన్నా రం గ్రామానికి చెందిన తుంగ రాజపోచం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్సీ దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

వేదికపైనే వివాహ ధ్రువీకరణ పత్రం అందజేత

కోటపల్లి : పెళ్లి మండపంలోనే నూతన జంటకు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వివాహ ధ్రువీకరణ పత్రం అందించారు. వెంచపల్లి సర్పంచు పడాల రాజు బాయి మనవడు పడాల సతీష్‌, ఇదే గ్రామానికి చెందిన రవళిల వివాహ కార్య క్రమానికి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీలతో కలిసి హాజరైన ఆయన నూతన జంటను ఆశీర్వదించారు. పంచాయతీ కార్యదర్శి స్వర్ణ అందించిన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని వధూవరులకు అందించారు.  

సదాసేవ ఆదర్శనీయం 

మందమర్రిటౌన్‌, మే 21: సదాసేవ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినం దనీయమని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తెలిపారు. అంబలి కేంద్రం వద్ద శని వారం ప్రభుత్వ విప్‌ అంబలి పంపిణీ చేసి మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు వేసవిలో చలి వేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, అంబలి పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మ్మెల్సీ దండె విఠల్‌, సంస్థ వ్యవస్ధాపకుడు సంగి సంతోష్‌, సభ్యులు యాకూబ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం

మందమర్రి, మే 21: పట్టణంలోని రామాలయం చౌరస్తా వద్ద గల అభయాం జనేయ స్వామి విగ్రహ 16వ వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు శనివారం  నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌ పాల్గొని  తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం పలు పూజా కార్యక్రమాల అనంతరం అన్నదానం చేశారు.  

రామకృష్ణాపూర్‌ పట్టణ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బోయినపల్లి నర్సింగ రావు ఇటీవల గుండె పోటుతో మరణించడంతో ఆయన చిత్ర పటానికి ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌ పూలు వేసి  నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Updated Date - 2022-05-22T04:26:56+05:30 IST