ఒంగోలులో ప్రైవేటు వైద్యశాలల తనిఖీ
ABN , First Publish Date - 2021-10-27T05:12:51+05:30 IST
ఒంగోలులో ప్రైవేటు వైద్యశాలను, స్కా నింగ్ సెంటర్లను వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తనిఖీ చేశా రు
ఒంగోలు (కలె క్టరేట్), అక్టోబరు 26: ఒంగోలులో ప్రైవేటు వైద్యశాలను, స్కా నింగ్ సెంటర్లను వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తనిఖీ చేశా రు మంగళవారం సా యంత్రం స్థానిక శ్రీల క్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, శ్రీలక్ష్మీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పటల్, సాయి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, స్టార్ డయాగ్నోస్టిక్ సెం టర్లను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్కానింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు త ప్పకుండా పాటించాలని ఆదేశించారు.
సిటి స్కానింగ్ మిషన్స్ వద్ద అర్హులై న టెక్నిషియన్ను నియమించాలని సూచించారు. ప్రతి కేంద్రంలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటి ంచాలని, ఇకపై ప్రతినెలా రాష్ట్రస్థాయి అ ధికారుల తనిఖీలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో పీవోడీటీటీ డా క్టర్ టి.వెంకటేశ్వర్లు, జిల్లా మాస్ మీడియా అధికారులు బెల్లం నరసింహారావు, బి.శివసాంబిరెడ్డి పాల్గొన్నారు.