టిడ్కో లబ్ధిదారులకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2022-08-18T06:24:22+05:30 IST
టిడ్కో హౌసింగ్ లబ్ధిదారులకు వారి పేరు మీద విద్యుత్ మీటర్లు అమర్చేందుకు చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా యూసీడీ అధికారులను ఆదేశించారు.
మహారాణిపేట, ఆగస్టు 17: టిడ్కో హౌసింగ్ లబ్ధిదారులకు వారి పేరు మీద విద్యుత్ మీటర్లు అమర్చేందుకు చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా యూసీడీ అధికారులను ఆదేశించారు. బుధవారం జీవీఎంసీ 35, 39 వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీహార్స్ జంక్షన్ చిలక పేటలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడ్కో గృహాలకు విద్యుత్ మీటర్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాలను రహదారిపై విచ్ఛలవిడిగా పారవేస్తే వారివద్ద నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు.