వైసీపీ ఎమ్మెల్మేకు పరాభవం

ABN , First Publish Date - 2022-03-06T01:25:10+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు పరాభవం ఎదురైంది.

వైసీపీ ఎమ్మెల్మేకు పరాభవం

పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు పరాభవం ఎదురైంది. వంతెన కోసం అడుగుతున్న గ్రామస్తులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. దీంతో వెళ్లిపోండంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటిపెదపూడి శివారు ఉచ్చులవారిపేటలో శ్మశానవాటికకు గ్రామస్తులు వెళ్లాలంటే తెప్పలు సహాయంతో పంట కాలువ దాటాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారికి వంతెన నిర్మాణం ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతుంది. ఈక్రమంలో గంటిపెదపూడి నుంచి వస్తున్న చిట్టిబాబును గ్రామస్తులు అడ్డుకున్నారు. కొన్నేళ్లుగా గ్రామస్తులు పడుతున్న బాధలను వివరించి తమకు వంతెన కావాలని అడిగారు. త్వరలో లంకగ్రామాలకు వంతెన వస్తుందని, దీనిలో భాగంగా పంటకాలువపై కూడా వంతెన నిర్మాణం జరుగుతుందని కంగారు పడవద్దని ఎమ్మెల్యే వివరించారు. ఆ వంతెన ఎప్పుడు వస్తుందో తెలియదని, తమకు ప్రత్యేకంగా వంతెన కావాలని అడిగారు. దీంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. వంతెన అవ్వదని చెప్పడంతో.. వెళ్లిపోండంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే చిట్టిబాబు అక్కడ నుంచి వెనుతిరిగారు.


Updated Date - 2022-03-06T01:25:10+05:30 IST