కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలు.. 12 వరకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2022-06-27T18:27:19+05:30 IST
స్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీలు)ల్లో 2022-23గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీలు)ల్లో 2022-23గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించినట్లు సమగ్రశిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వి ఆదివా రం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 27 నుంచి జూలై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అనాథలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు అర్హులని తెలిపారు. https://apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.