ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు షురూ
ABN , First Publish Date - 2021-10-26T05:03:30+05:30 IST
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు షురూ
వరంగల్ కలెక్టరేట్, అక్టోబరు 25: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని ఇంటర్ పరీక్షల నోడల్ ఆఫీ సర్ కాక మధవరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 5,092 మంది విద్యార్థులకు గా ను ఇందులో మొదటి రోజు 4,695 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు, 397 మంది విద్యార్థులు హాజరు కాలేదని మాధవరావు తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించగా, విద్యార్థులు పరీ క్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయగగా విద్యా ర్థులు భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల్లో పాల్గొన్నారు.