పాము కాటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-01-24T05:10:54+05:30 IST

మండలంలోని మున్యాల్‌ గ్రామానికి చెందిన ఎర్రకొట్టే హరిప్రసాద్‌ (17) అనే ఇంటర్‌ విద్యార్థి పాము కాటుకు గురై నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు.

పాము కాటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి
ఎర్రకొట్టే హరిప్రసాద్‌ మృతదేహం

దస్తూరాబాద్‌, జనవరి 23 : మండలంలోని మున్యాల్‌ గ్రామానికి చెందిన ఎర్రకొట్టే హరిప్రసాద్‌ (17) అనే ఇంటర్‌ విద్యార్థి పాము కాటుకు గురై నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం  మృతి చెందాడు. మండల ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మున్యాల్‌ గ్రామానికి చెందిన ఎర్రకొట్టే కిష్టయ్య మొదటి కొడుకు హరిప్రసాద్‌ తన తమ్ముడితో కలిసి గురువారం సాయంత్రం పొలం పనుల నిమిత్తం వెళ్లగా నీళ్లు పెడుతున్న సమయంలో పాము కాటు వేయగా ఇంటికి వచ్చి తన తండ్రితో విషయం చెప్పగా దస్తూరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకరాగ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి వైద్యుల సూచన మేరకు ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుక వెళ్లారు. పరిస్థితి విషమించడంతో నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఆయన తెలిపారు. 


Updated Date - 2021-01-24T05:10:54+05:30 IST